శ్రీవారిని దర్శించుకున్న రతన్ టాటా
సాక్షి, తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా ట్రస్టు ఛైర్మన్ రతన్ టాటా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రతన్టాటాతో పాటు టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.