అంచనాలను బీట్‌ చేసిన టెక్‌ మహీంద్రా | Tech Mahindra Q2 beats estimates; profit rises 4.7% to Rs 836 cr | Sakshi
Sakshi News home page

అంచనాలను బీట్‌ చేసిన టెక్‌ మహీంద్రా

Nov 1 2017 5:38 PM | Updated on Nov 1 2017 5:38 PM

Tech Mahindra Q2 beats estimates; profit rises 4.7% to Rs 836 cr

సాక్షి,ముంబై: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల టెక్ మహీంద్రా రెండవ త్రైమాసిక  ఫలితాల్లో  బుధవారం విశ్లేషకుల అంచనాలను  బీట్‌ చేసింది.   బుధవారం ప్రకటించిన క్యూ2లో  నికర లాభాలు సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన  4.7 శాతం  వృద్ధిని నమోదు చేసింది.

వార్షిక ప్రాతిపదికన 30శాతం జంప్‌ చేసి రూ. 836కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 644.73  లాభాలను నమోదు చేసింది.   రూపాయి ఆదాయం 3.7 శాతం పుంజుకుని క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ఆన్‌ రూ. 7006కోట్లను, డాలర్‌ రెవెన్యూ 3.6 పెరిగి  1179  మిలియన్‌ డాలర్లను ఆర్జించింది.  కాగా రూ.740 కోట్ల లాభాలను, రూ. 7,551కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని ఎనలిస్టులు అంచనావేశారు.  

డేవిడ్ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిసరప్షన్‌ ) వ్యూహంతో, త్రైమాసికంలో ఆదాయం, నికర లాభం, కొత్త వ్యాపారం లాభంలో మంచి వృద్ధి సాధించామని  టెక్ మహీంద్ర సీఎండీ సీపీ గనర్ని  చెప్పారు. ఈ త్రైమాసికంలో రూపాయి రెవెన్యూ 3.7 శాతం పెరిగి రూ .7,606 కోట్లకు చేరింది. డాలర్ రెవెన్యూ 3.6 శాతం పెరిగి 1,179.2 మిలియన్ డాలర్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు   22.2 శాతం పెరిగి రూ .840 కోట్లకు పెరిగింది. 2017 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి 160 బేసిస్ పాయింట్లు పెరిగి మార్జిన్ 11 శాతం పెరిగింది.

ఈ త్రైమాసికంలో అగ్రిమెంట్ రేట్ (ఎల్టిఎమ్) గత త్రైమాసికంలో 17 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. క్యూ2లో   ఐటి వినియోగం 77 శాతం నుండి 81 శాతం పెరిగింది, ఐటి వినియోగం (ట్రినెస్ మినహాయించి) 81 శాతం వద్ద ఉంది.  ఫారెక్స్‌ రెవెన్యూ 16.7 శాతం తగ్గి 227 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంలో రూ .322.2 కోట్లతో  పోల్చుకుంటే 21.5 శాతం క్షీణించిందని పేర్కొంది . ఈ క్వార్టర్‌లో తమ కొత్త 21 క్లయింట్లతో మొత్త  885 మంది ఖాతాదారులున్నారు.  అలాగే గత క్వార్టర్‌లోని అట్రిషన్‌ రేట్‌ 17శాతంతో పోలిస్తే ప్రస్తుతం16 శాతానికి తగ్గిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర 1.6 శాతం లాభపడింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement