క్రెడిట్ ఎనాలసిస్ అండ్ రీసెర్చ్
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్
ప్రస్తుత ధర: రూ.1,454 టార్గెట్ ధర: రూ.1,770
ఎందుకంటే: రేటింగ్ సర్వీసులందజేసే రెండో అతిపెద్ద భారత కంపెనీ ఇది. మాల్దీవులు, హాంగ్కాంగ్, నేపాల్, మారిషస్లకు కూడా తన సేవలను విస్తరించింది. బ్రెజిల్, పోర్చుగల్, మలేషియా, దక్షిణాఫ్రికా దేశాల్లో రేటింగ్ సర్వీసులందజేయడానికి ఆయా దేశాలకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రీసెర్చ్ సర్వీసులు కూడా అందిస్తోంది. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించింది. రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించనున్నది. భారత్లో ఆర్థిక పరిస్థితుల మెరుగుపడుతుండటంతో కార్పొరేట్ డెట్ రేటింగ్స్, బ్యాంక్లోన్ రేటింగ్స్కు డిమాండ్ పెరుగుతుందని అంచనా. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.
ఆదాయం 7 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ పుంజుకుంటుండటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, మౌలిక, గృహ నిర్మాణ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల రుణ వృద్ధి పుంజుకోగలదని కేర్ అంచనా వేస్తోంది. ఫలితంగా కంపెనీ అమ్మకాలు రెండేళ్లలో 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. క్యూ1లో కొత్తగా 817 క్లయింట్లు లభించారు. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 15,222కు పెరిగింది. రెండేళ్లలో ఇబిటా 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా. ఈ కంపెనీ రేటింగ్ అంచనాలు తప్పితే కంపెనీ విశ్వసనీయత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ మొత్తం ఆదాయంలో రేటింగ్ ఆదాయం 97 శాతంగా ఉంది. పోటీ కంపెనీలైన క్రిసిల్, ఇక్రాల ఆదాయంలో వివిధీకరణ సాధించాయి. వ్యయాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగం కారణంగా ఈ కంపెనీకి నిర్వహణ మార్జిన్లు అధికంగా ఉన్నాయి. కొత్త విభాగాల్లోకి, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం.. మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
ఎన్బీసీసీ
బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర: రూ.205 టార్గెట్ ధర: రూ.227
ఎందుకంటే: ఎన్బీసీసీ.ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీల్లో ఒకటి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయ వృద్ది ఆంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వ్యయాలు తక్కువగా ఉండడం, ఇబిటా మార్జిన్లు అధికంగా ఉండటంతో నికర లాభం 24% వృద్ది చెందింది. పీఎంసీ వ్యాపారం 3% పెరగ్గా, రియల్ ఎస్టేట్వ్యాపారం 49%, ఈపీసీ వ్యాపారం 10% చొప్పున క్షీణించాయి. ఇబిటా మార్జిన్లు 160 బేసిస్ పాయింట్లు వృద్ది చెంది 5.1 శాతానికి పెరిగాయి. వడ్డీ వ్యయాలు తగ్గడంతో నికర లాభం 24 శాతం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మార్జిన్ 7 శాతానికి చేరగలదని అంచనా. పూర్తి చేయాల్సిన ఆర్డర్లు రూ.75వేల కోట్లకు పైగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల మేర ఆర్డర్లు వస్తాయని అంచనా. రీడెవలప్మెంట్ ఆర్డర్లు భారీగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి ఆదాయ వృద్ధి మరింతగా మెరుగుపడగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 38 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. భారీ ప్రాజెక్టుల అమలులో నైపుణ్యం, పోటీ తక్కువగా ఉండడం, ఆర్డర్ బుక్ భారీగా ఉండడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. ఇటీవలనే పది రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ కాంట్రాక్ట్ను ఈ కంపెనీ సాధించింది. రానున్న కొన్నేళ్లలో మరో 40–50 రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లను సాధించే అవకాశాలున్నాయి. ఒక్కో రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ విలువ రూ.400–500కోట్ల రేంజ్లో ఉంటుంది. రూ.25,000–40,000 కోట్ల విలువ ఉండే ముంబైలోని ధారవి మురికివాడ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఈ కంపెనీకే దక్కవచ్చు.
స్టాక్స్ వ్యూ
Published Mon, Aug 28 2017 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement