350 పాయింట్లు జంప్‌ చేసిన స్టాక్‌మార్కెట్లు | Sensex Jumps Over 350  Points  | Sakshi
Sakshi News home page

350 పాయింట్లు జంప్‌ చేసిన స్టాక్‌మార్కెట్లు

Jun 25 2019 3:05 PM | Updated on Jun 25 2019 3:16 PM

Sensex Jumps Over 350  Points  - Sakshi

సాక్షి, ముంబై :  అంతర్జాతీయ ప్రతికూల  సంకేతాలతో  బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల  హై జంప్‌ చేశాయి. 100 పాయింట్లకుపైగా క్షీణించిన సెన్సెక్స్‌  ప్రస్తుతం  ట్రిపుల్‌ సెంచరీకి పైగా లాభాలతో దూసుకుపోతోంది. సెన్సెక్స్‌ 319 పాయింట్లు ఎగసి 39,442 వద్ద,  నిఫ్టీ సైతం 97 పాయింట్లు పుంజుకుని 11,796 వద్ద ట్రేడవుతోంది. 

దాదాపు అన్ని షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి.  ప్రధానంగా  మెటల్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో   సెక్టార్లు లాభపడుతున్నాయి.  బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, హిందాల్కో, ఆర్‌ఐఎల్‌, బ్రిటానియా, యాక్సిస్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉండగా.  జీ, ఇన్ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ స్వల్పంగా నష్టపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement