లాభాలతో కొనసాగుతున్న సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ కొనసాగుతునే ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ కొనసాగుతునే ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, కన్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 24227 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల వృద్దితో 7293 వద్ద కొనసాగుతున్నాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ 11 శాతానికి పైగా లాభపడగా, కోల్ ఇండియా 5.20 శాతం, మారుతి 4.55, ఎన్ టీ పీసీ 4.29, సెసా గోవా 3.67 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
హిండాల్కో, భెల్, హెచ్ డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.