భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు లాభాలతో ముగిసాయి.
రికార్డు గరిష్టస్థాయి వద్ద సెన్సెక్స్ క్లోజ్
Aug 19 2014 5:45 PM | Updated on Sep 2 2017 12:07 PM
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 26420 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల వృద్దితో 7897 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద క్లోజవ్వడం విశేషం.
బీపీసీఎల్, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండియా బ్యాంక్ మూడు శాతానికి పైగా..టాటా మోటార్స్, యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లలో హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, హిండాల్కోలు ఉన్నాయి.
Advertisement


