జియో ప్రైమ్‌ రెన్యూవల్‌ ఆప్షన్‌ కనిపించడం లేదా?

Jio Prime Renewal Option Not Visible In MyJio App? - Sakshi

జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసిపోయింది. ఇప్పటికే జియో ప్రైమ్‌ మెంబర్లుగా ఉన్న వారికి మరో ఏడాది పాటు ఈ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే ఈ రెన్యూవల్‌ ప్రక్రియ ఆటోమేటిక్‌గా యూజర్లకు క్రెడిట్‌ అవడం లేదు. జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను మరో ఏడాది పాటు పొడిగించుకోవడానికి యూజర్‌ అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మైజియో యాప్‌లో ఒక మెసేజ్‌ వస్తోంది. కానీ చాలా మంది యూజర్లకు ఈ మెసేజ్‌ రావడం లేదని తెలుస్తోంది. దీంతో యూజర్లు ఈ ఉచిత రెవెన్యూల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. 

ఈ ఇబ్బందుల నుంచి బయటపడి, మరో ఏడాది పాటు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్‌ చేసుకునే మార్గమేమిటో ఓ సారి చూద్దాం...
మీరు రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన జియో యూజర్‌ అయినప్పటికీ ప్రైమ్‌ను పొడిగించుకోవడానికి మెసేజ్‌ రాకపోతే, ముందుగా జియో యాప్‌ను క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 నిమిషాల పాటు వీడియోలను స్ట్రీమ్‌ చేయాలి. ఆ తర్వాత మరోసారి జియో యాప్‌ను తిరిగి స్టార్ట్‌ చేయాలి. ఏ నెంబర్‌కు అయితే జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను వాడుతూ లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో జియో యాప్‌లో బ్యానర్‌ పేజీలో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రెన్యూవల్‌ ఆప్షన్‌ కనిపిస్తోంది. ఆ ఆప్షన్‌పై యూజర్లు అప్లయ్‌ చేసుకోవాలి. స్టాండర్డ్‌ రెన్యూవల్‌ ప్రాసెస్‌ను యూజర్లు ఫాలో అవ్వాలి. బ్యానర్‌లో గెట్‌ నౌ అనే బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బటన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్టు ఒక మెసేజ్‌ వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రర్‌ నెంబర్లు కూడా వస్తాయి. ఆ నెంబర్లలో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకున్న నెంబర్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ పూర్తైపోతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top