⇒ 2021 నాటికి రూ.12,500 కోట్లకు
⇒ గూగుల్, కేపీఎంజీ నివేదిక
న్యూఢిల్లీ: ఆన్లైన్ విద్యారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా విద్యా కంటెంట్ వినియోగం పెరుగుతుండడంతో 2021 నాటికి ఈ మార్కెట్ 1.96 బిలియన్ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్–కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరతారని అంచనా వేసింది. ఈ నివేదిక ‘భారత్లో ఆన్లైన్ విద్య: 2021’ పేరుతో విడుదలైంది. ఆన్లైన్లో విద్యా సంబంధిత సమాచారం కోసం అన్వేషించే వారి సంఖ్య గత రెండేళ్లలో రెండు రెట్లు, మొబైల్స్ ద్వారా వెతికే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
మొత్తం మీద ఈ విధంగా శోధించే వారిలో 44 శాతం మంది ఆరు మెట్రో నగరాలకు వెలుపలి నుంచే ఉండడం విశేషం. గత ఏడాది కాలంలో ఒక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారానే విద్యా సంబంధిత కంటెంట్ వినియోగంలో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించినట్టు నివేదిక తెలిపింది. ఆన్లైన్లో నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులకు డిమాండ్ ఉందని పేర్కొంది. 26 కోట్ల మంది విద్యార్థులతో కూడిన ప్రాథమిక, సెకండరీ విద్యార్థుల విభాగం 2016లో రెండో అతిపెద్ద విభాగంగా ఉండగా, ఇది ఏటా 60 శాతం చొప్పున వృద్ధితో 2021 నాటికి 77.3 కోట్ల మందితో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆన్లైన్లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విభాగం ప్రస్తుతం చిన్నగానే ఉన్నప్పటికీ... ఇది కూడా ఏటా 64 శాతం పెరుగుతూ 2021కి 51.5 కోట్లకు విస్తరిస్తుందని తెలిపింది. ఆన్లైన్ విద్యా విభాగం భారత్కు మల్టీ బిలియన్ డాలర్ల అవకాశాలను కల్పించనుందని గూగుల్ ఇండియా డైరెక్టర్ నితిన్ బావన్కులే పేర్కొన్నారు.
భారత్లో ఆన్లైన్ విద్యకు భారీ మార్కెట్
Published Wed, May 31 2017 12:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement