ఇండియా పోస్ట్ యాప్ షురూ | India Post sets up e-commerce centre | Sakshi
Sakshi News home page

ఇండియా పోస్ట్ యాప్ షురూ

May 12 2015 12:42 AM | Updated on Sep 18 2018 8:18 PM

ఇండియా పోస్ట్ యాప్ షురూ - Sakshi

ఇండియా పోస్ట్ యాప్ షురూ

ఇండియా పోస్ట్ యాప్‌ను టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ యాప్‌ను టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్‌లో ట్రాకింగ్, తపాలా శాఖ కార్యాలయ వివరాలు తెలుసుకోవడం, పోస్టేజ్ క్యాల్‌కులేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖను దేశ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని చెప్పారు. చివరకు మావోయిస్టులు కూడా ఎక్కడ ప్రజల మద్దతు కోల్పోతామేమోనని తపాలా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ-కామర్స్ రంగంలో ఇండియా పోస్ట్ ప్రధాన  భూమిక పోషిస్తుందన్నారు.

అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఇండియా పోస్ట్ సేవలను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చారు. ఇండియా పోస్ట్ దాదాపు 1.55 లక్షల తపాలా కార్యాలయాలను కలిగి ఉంది. వీటిలో 1.39 లక్షల కార్యాలయాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement