40 ఎంపీ ట్రిపుల్‌-కెమెరాతో హువాయ్‌ స్మార్ట్‌ఫోన్‌ | Huawei may soon launch a new smartphone with a 40 MP triple-camera module | Sakshi
Sakshi News home page

40 ఎంపీ ట్రిపుల్‌-కెమెరాతో హువాయ్‌ స్మార్ట్‌ఫోన్‌

Dec 7 2017 11:04 AM | Updated on Dec 7 2017 11:04 AM

Huawei may soon launch a new smartphone with a 40 MP triple-camera module - Sakshi

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు రోజురోజుకి మరింత మెరుగ్గా రూపొందుతూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ విషయంలో ఐఫోన్‌ కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ, దాన్ని ప్రత్యర్థులు శాంసంగ్‌, గూగుల్‌, హువాయ్‌లు మాత్రం ఆపిల్‌ మించిపోయే ఉన్నాయి. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రిపోర్టుల ప్రకారం హువాయ్‌, వచ్చే వారాల్లో ఫోటోగ్రఫీ-సెంట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాన్‌ బ్లాస్‌ కూడా కొత్త హువాయ్‌ స్మార్ట్‌ఫోన్‌పై ట్వీట్‌ చేశారు.

హువాయ్‌ కొత్తగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వెనుక వైపు 40 ఎంపీ ట్రిపుల్‌-లెన్స్‌ కెమెరా మోడ్యుల్‌ను కలిగి ఉన్నట్టు తెలిపారు. సెల్ఫీ కెమెరా కూడా 24 మెగాపిక్సెల్‌ రూపొందుతుందని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌కు జర్మన్‌ కెమెరా కంపెనీ లైకా కో-డెవలప్డ్‌గా సహకారం అందిస్తుందని ఇవాన్‌ బ్లాస్‌ ట్వీట్‌ చేశారు.  హువాయ్‌ అంతకముందు విడుదల చేసిన పీ10, మేట్‌ 10 స్మార్ట్‌ఫోన్లకు కెమెరా మోడ్యుల్స్‌ను లైకానే అభివృద్ధి చేసింది.   

ట్రిపుల్‌ కెమెరా మోడ్యుల్‌ హ్యువాయ్‌ తీసుకురాబోతున్న తొలి ఫోన్‌. ఈ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లో హువాయ్‌ విజయవంతమవుతుందో లేదోనని టెక్‌ వర్గాలు ఆసక్తికరంగా వేచిచూస్తున్నాయి. జర్మన్‌ కెమెరా తయారీదారి లైకాతో హువాయ్‌ గత కొన్నేళ్లుగా భాగస్వామ్యం కొనసాగిస్తోంది. లైకా భాగస్వామ్యంలో భారత్‌లో తొలిసారి విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ హువాయ్‌ పీ9.  

Advertisement
 
Advertisement
Advertisement