ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌, డిస్కౌంట్‌ ఆఫర్స్‌

Flipkart Samsung Carnival Offers Galaxy S7 at Rs. 22,990 - Sakshi

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు తెరలేపింది. శాంసంగ్‌ కార్నివల్‌(ఉత్సవం) పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, వేరియబుల్స్‌, హెడ్‌ఫోన్లు, మొబైల్‌ యాక్ససరీస్‌, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌, మైక్రోవేవ్స్‌, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి వాటిపై డిస్కౌంట్లను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ 9వ తారీఖుతో ముగుస్తుంది.

ఈ సేల్‌లో భాగంగా రూ.46వేల ధర కలిగిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌ రూ.22,990కు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,900కు విక్రయిస్తోంది. దీని ఎంఆర్‌పీ రూ.41,900గా ఉంది. మిడ్‌-రేంజ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 64జీబీ ఫోన్‌ ధర రూ.17,900 నుంచి రూ.11,900కి దిగొచ్చింది. గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 16జీబీ స్మార్ట్‌ఫోన్‌ రూ.10,999 నుంచి రూ.9,999కు తగ్గింది. గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌ 32జీబీ స్మార్ట్‌ఫోన్‌ రూ.13,900కే అందుబాటులో ఉంది. 

అంతేకాక ఈ ఫెస్టివల్‌లో భాగంగా టాబ్లెట్‌ రేంజ్‌ రూ.8,999 నుంచే ప్రారంభమైంది. శాంసంగ్‌ గేర్‌ ఫిట్‌2 ప్రొ రూ.13,590కే లభ్యమవుతోంది. ప్రీఆర్డర్లకు 5 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. శాంసంగ్‌ హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లు, మెమరీ కార్డులు, హార్డ్‌ డ్రైవ్‌లు, మొబైల్‌ ఛార్జర్లు వంటి వాటిపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది.

శాంసంగ్‌ 49 అంగుళాల కర్వ్‌డ్‌ స్మార్ట్‌ టీవీ ధర రూ.91,900 నుంచి రూ.59,999కు దిగొచ్చింది. మరో బేసిక్‌ స్మార్ట్‌ టీవీ ఈ ఫెస్టివల్‌లో భాగంగా రూ.23,999కే లభ్యమవుతోంది. శాంసంగ్‌ హెచ్‌డీ రెడీ టీవీ ధర కూడా రూ.11,499 నుంచే ప్రారంభమవుతోంది. మానిటర్స్‌ 35 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫోన్‌పే ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో చేసే చెల్లింపులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top