ఆ రంగంలో కొలువుల జోష్‌.. |  Hiring in infrastructure sector up | Sakshi
Sakshi News home page

ఆ రంగంలో కొలువుల జోష్‌..

Nov 8 2017 3:04 PM | Updated on Nov 8 2017 3:04 PM

 Hiring in infrastructure sector up - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ఉద్యోగుల నియామకం ఈ ఏడాది అక్టోబర్‌లో గణనీయంగా పెరిగింది. మౌలిక రంగం నియామకాల్లో 12 శాతం వృద్ధి చోటుచేసుకుందని ఓ నివేదిక వెల్లడించింది. తయారీ, ఉత్పాదక, ఐటీ, సేల్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో హైరింగ్‌ పుంజుకున్నామౌలిక నిర్మాణ రంగంలోనే ఉపాథి వృద్ధి గణనీయంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం,పెద్ద ఎత్తున పలు మౌలిక ప్రాజెక్టులు సాగుతుండటంతో ఈ రంగంలో నియామకాలకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని తెలిపింది. వదోదర, బెంగుళూరుల్లో నైపుణ్యాలకు డిమాండ్‌ నెలకొంది. కర్ణాటకలోనూ ఈ రంగాల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది.

మౌలిక రంగంతో పాటు పెట్రోకెమికల్స్‌లోనూ నియామకాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. క్వాలిటీ కంట్రోల్‌ నిపుణులతో పాటు ఆయా విభాగాల్లో సీనియర్‌ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ నెలకొందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement