'కోటి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం' | ysrcp mla rk roja console the munikama koti family members | Sakshi
Sakshi News home page

'కోటి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం'

Aug 14 2015 11:03 AM | Updated on May 29 2018 2:33 PM

కాంగ్రెస్ పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికామ కోటి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు.

తిరుపతి: కాంగ్రెస్ పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికామ కోటి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కోటిని బలి తీసుకున్నాయని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. తన అవినీతిని బయట పెట్టకుండా ఉండటానికి చంద్రబాబు బీజేపీకి లొంగిపోయారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement