వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో భేటీ కానున్నారు.
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో భేటీ కానున్నారు. మధ్యాహ్నం వైఎస్ జగన్... మూడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన సమావేశమవుతారు. తిరుపతిలో పీఎల్ఆర్ కన్వెన్షన్హాల్లో ఎన్ఆర్ఐ చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. వివాహ రిసెఫ్షన్ అనంతరం ఆయన పులివెందుల బయల్దేరి వెళతారు.