వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
Jan 26 2017 7:33 PM | Updated on Mar 23 2019 9:10 PM
శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కనీసం క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా ఎయిర్పోర్టులోనే ఆయనను నిర్బంధించిన తీరును పార్టీ తీవ్రంగా నిరసించింది.
ఈ వైఖరికి నిరసనగాను, ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగాను ఈనెల 27వ తేదీ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.
Advertisement
Advertisement