breaking news
statewide protest
-
రేపు ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రేపు(మంగళవారం) రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం పిలుపు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిర్ణయించింది. కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఏడాది పాలనలో నేరాలు ఘోరాలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా హోం మంత్రి అనిత కనీసం స్పందించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సగటున రెండు రోజులకి ఒక అత్యాచారం జరుగుతుండగా.. ఇంకా వెలుగులోకి రాని అఘాయిత్యాలు ఎన్నో?!. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని.. ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని వైఎస్సార్సీపీ చంద్రబాబుకు హితవు పలుకుతోంది. -
రేపు బంద్ పై ఉత్కంఠ
-
ఆర్టీసీ సమ్మె; రేపు బంద్.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్మికుల ఆందోళనలు, నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలు, విపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో కరీంనగర్ రెండు డిపోల ముందు కార్మికులు శుక్రవారం ధర్నా, నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకుల అరెస్ట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకూ ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను వియస్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్థామరెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్లారు. రేపు రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు కూడా రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. హైకోర్టు తీర్పుపై ఉఠ్కంఠ ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో ఉన్నత న్యాయస్థానం పలు కీలక వాఖ్యలు చేసింది. ఇరుపక్షాలు పంతానికి పోకుండా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఆర్టీసీకి ఎండీని నియమించి.. చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీసీ సమ్మె, ప్రజల సమస్యలపై పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బంద్కు సహకరించండి: తమ్మినేని నల్లగొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం చేపట్టనున్న రాష్ట్ర బంద్కు సహకరించాలని ప్రజలకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వామపక్షాల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, సామాన్య వర్గాలు సహకరించాలని కోరారు. బంద్కు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని.. సన్నాహకాల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు. బీజేపీ బైక్ ర్యాలీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ శేరిలింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీకి హాజరయ్యారు. -
రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న ప్రజలు
-
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కనీసం క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా ఎయిర్పోర్టులోనే ఆయనను నిర్బంధించిన తీరును పార్టీ తీవ్రంగా నిరసించింది. ఈ వైఖరికి నిరసనగాను, ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగాను ఈనెల 27వ తేదీ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. -
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: అరెస్ట్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపు నిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. దాంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న పరిస్థితుల వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ఆర్ జిల్లా : కడప ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుతోపాటు కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డిపోలోని రెండు గేట్లను మూసివేసి... బస్సులను నిలిపివేశారు. పులివెందుల బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బస్సులను పార్టీ శ్రేణులు నిలిపివేశారు. ఈ ధర్నాలో దేవిరెడ్డి శంకర్రెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరు మండలం కుక్కల్దొడ్డి వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బద్వేల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు ధర్న నిర్వహించాయి. రాయచోటి బంద్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. జమ్మలమడుగులో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. బస్సులు నడవటం లేదు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కర్నూలు జిల్లా : కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆరెస్ట్. ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాములు ఆధ్వర్యంలో బంద్ అనంతపురం జిల్లా : అనంతపురంలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలింపు. పెనుకొండలో శంకర్నారాయణ ఆధ్వర్యంలో బంద్ చిత్తూరు జిల్లా : నారాయణవనంలో హైవేపై వైఎస్ఆర్ సీపీ సత్యవీడు నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మదనపల్లెలో బాబ్జాన్ ఆధ్వర్యంలో బంద్, అరెస్ట్ నెల్లూరు జిల్లా : గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మేరగ మురళీధర్, ఎల్లసిరి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. వాకాడులో ఆర్టీసీ డిపో వద్ద నేదురుమిల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రకాశం జిల్లా: గిద్దలూరులో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సుమారు 12మంది నేతలను పోలీసులు స్టేషన్కు తరలించారు. కొండేపిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బంద్, పలువురు అరెస్ట్ గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్స్టాండ్ వద్ద బంద్ పాటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తొమ్మిది మంది పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఈ రోజు తెల్లవారుజామున మంగళగిరి బస్సు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే బస్టాండ్ వద్ద కూడా ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బంద్కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులుబైక్ ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లిలో బంద్ పాటించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబుతోపాటు 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆందోళకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రేపల్లెలో బంద్ పాటిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్కుమార్, మైనారిటీ నేత షేక్ సుభానీతోపాటు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వామపక్షాల ర్యాలీ అరెస్ట్. పెదకూరపాడు నియోజకవర్గంలో కావటి శివనాగమనోహరనాయుడు ఆధ్వర్యంలో బంద్ కృష్ణాజిల్లా : విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. నేతలు వంగవీటి రాధ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారధి, వంగవీటి రాధ, పి.గౌతంరెడ్డి, నాగిరెడ్డి... ఆర్టీసీ ప్రయాణికులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి గులాబీలు ఇచ్చి బంద్కు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో వీరి ప్రచారానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్థసారథితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైటాయించారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. బంద్కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. తిరువూరులో కాంగ్రెస్, వామపక్ష నేతలు అరెస్ట్ పశ్చిమగోదావరి జిల్లా : కొవ్వూరు ఆర్టీసీ డిపో ముట్టడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షల పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. ద్వారకాతిరుమల బస్టాండ్ వద్ద తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆందోళన. పెనమంట్ర మండలం మార్టూరులో పలువురు ఆందోళనకారులు అరెస్ట్ తూర్పు గోదావరి జిల్లా : రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహా నాయకులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా ఆందోళన చేస్తున్నారు. రంపచోడవరంలో వైఎస్ఆర్ సీపీ నేతల ఆందోళన... పాల్గొన్న ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి, ఉదయభాస్కర్. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి ఆధ్వర్యంలో బంద్. రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో బంద్, ధర్నా విశాఖపట్నం జిల్లా : మద్దిలపాలెంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్కు సహకరించాలని కోరుతూ తాటిచెట్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. కూర్మన్నపాలెంలో దామ సుబ్బారావు, రాజ్కుమార్ ఆధ్వర్యంలో బంద్ పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో బంద్. బస్సులను నిలిపేసిన పార్టీ శ్రేణులు, భారీగా మోహరించిన పోలీసులు అనకాపల్లిలో సీపీఐ నాయకులు అరెస్ట్ కాశింకోట జాతీయరహదారిపై మళ్లా బుల్లిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో విజయనగరం జిల్లా : విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితోపాటు పట్టణ అధ్యక్షుడు వేణు, బంగారు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా : పాతపట్నంలో వైఎస్ఆర్ సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకుడు తమ్మినేని సీతారంతోపాటు పలువురు పార్టీ నేతలు అరెస్ట్. రణస్థలంలో గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో బంద్. ఇచ్చాపురంలో మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ అరెస్ట్ -
విజయమ్మ అరెస్ట్కు రాష్ట్రవ్యాప్తంగా నిరసన
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అరెస్ట్కు నిరసన వ్యక్తమవుతోంది. వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న విజయమ్మను ఖమ్మం-నల్గొండ సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి వద్ద అడ్డుకొని, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్కు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసుల చర్యని ఖండించారు. ఆ పార్టీ నేతలు హైదరాబాద్ లో డిజిపి ప్రసాదరావును కలిసి తమ నిరసన తెలిపారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి విజయమ్మ పర్యటనను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. విజయమ్మ అరెస్ట్కు నిరసనగా ఖమ్మం జిల్లా తల్లాడలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తిరుపతి చంద్రగిరి రోడ్డులో ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం పిరికిపంద చర్య అన్నారు. తక్షణమే మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలను తొలగించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సెంటర్లో ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరులో కొయ్యె మోషన్ రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో పార్టీ కార్యకర్తలు జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కర్నూలులో ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన ప్రాంతాలలో ప్రధాని, సోనియా గాంధీ పర్యటిస్తే ఇలానే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ విజయమ్మను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతకాని దద్దమ్మలు, ఓడిపోతామనే భయంతోనే విజయమ్మను అడ్డుకున్నారన్నారు.