11, 12, 13 తేదీల్లో వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం 

YSR Congress Party Samara Sankharavam at Anantha and Nellore and Prakasam - Sakshi

11, 12, 13 తేదీల్లో అనంత, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 11, 12, 13వ తేదీల్లో అనంతపురం, పీఎస్సార్‌ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరశంఖారావం సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ‘జగనన్న పిలుపు’అనే కార్యక్రమంలో భాగంగా తటస్తులైన ఓటర్లకు ఆయన ఇదివరకే లేఖలు రాసిన విషయం తెలిసిందే. తటస్తులు హాజరయ్యే ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ తొలుత పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత పోలింగ్‌ బూత్‌ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్‌ పాల్గొని, వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తారు.  

6, 7 తేదీల్లో చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 
ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 6న తిరుపతి (చిత్తూరు జిల్లా)లో సమరశంఖారావం సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 7న వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతాయి. ఈరెండు చోట్లా జగన్‌ పాల్గొని తటస్తులు, పార్టీ శ్రేణులతో విడిగా సమావేశమై ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top