'జగన్ను చూసి కాంగ్రెస్, టీడీపీలకు నిద్రపట్టడం లేదు' | ysr congress party mla amarnath reddy fire on congress and telugu desam parties | Sakshi
Sakshi News home page

'జగన్ను చూసి కాంగ్రెస్, టీడీపీలకు నిద్రపట్టడం లేదు'

Nov 3 2013 12:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు నిద్రపట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు నిద్రపట్టడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. ఆదివారం రాజంపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్లారు.

 

ఆ పర్యటనను అడ్డుకోవడం వెనక కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు విజయమ్మ పర్యటనను ఆడ్డుకోవడమే అత్యుత్తమమైన ఉదాహరణ అని ఆయన అమర్నాథరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement