'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది' | ysr congress party leader samineni udayabhanu slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది'

Jun 14 2014 12:46 PM | Updated on Aug 10 2018 8:08 PM

'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది' - Sakshi

'టీడీపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆపార్టీ నేత సామినేని ఉదయభాను తెలిపారు.

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆపార్టీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. తెలుగుదేశం పార్టీ అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. రైతు, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయాలని సామినేని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రిగా వైభవంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇప్పటికీ రుణమాఫీపై స్పషంగా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. వారి మోసాలకు ఇదే నిదర్శనమని సామినేని వ్యాఖ్యానించారు. బాబు ఎన్నికల ముందు ఒక మాట...ఆ తర్వాత ఇంకోమాట మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలు కూడా రద్దు చేశారని సామినేని ఉదయభాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement