నరేంద్ర మోడీ బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : నరేంద్ర మోడీ బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి అన్నారు. సాధారణ బడ్జెట్ నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఆయన గురువారమిక్కడ సాక్షి చానల్లోని చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు చేయూత ఇచ్చేలా బడ్జెట్ ఉండాలన్నారు. అయితే తాను ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడం లేదని, రైతుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాని నాగిరెడ్డి తెలిపారు.