చెన్నకేశవస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్ | YS jagan mohan reddy's raithu bharosa yatra on Day 2 | Sakshi
Sakshi News home page

చెన్నకేశవస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్

Feb 23 2015 10:38 AM | Updated on Sep 2 2017 9:47 PM

చెన్నకేశవస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్

చెన్నకేశవస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'రైతు భరోసా యాత్ర' రెండోరోజుకు చేరింది.

అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'రైతు భరోసా యాత్ర'  రెండోరోజుకు చేరింది. ఆయన సోమవారం ఉదయం కొత్తచెరువు మండలం ఇండ్ల వెంకటాపురంలో చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు వైఎస్ జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పురోహితులు వైఎస్ జగన్కు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

అనంతరం వైఎస్ జగన్ మరుకుంటపల్లికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కురబ కేశప్ప (55) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి కొత్త చెరువు చేరుకుంటారు. డ్వాక్రా మహిళలతో వారి సమస్యలపై చర్చిస్తారు. ఆపై అక్కడ నుండి బుక్కపట్నం మీదగా కొత్తకోట చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పిస్తారు. తర్వాత అక్కడ నుండి నేరుగా అనంతపురానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement