మాజీ ప్రధాని నెహ్రూకు వైఎస్ జగన్ నివాళి | ys jagan mohan reddy tributes to jawaharlal nehru | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని నెహ్రూకు వైఎస్ జగన్ నివాళి

Nov 14 2014 12:40 PM | Updated on Jul 25 2018 4:07 PM

భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

వైఎస్సార్ జిల్లా: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం నెహ్రూ 125 జయంతి వేడుకల్లో భాగంగా వేంపల్లి ఉర్దూ బాలిక గురుకుల పాఠశాలకు విచ్చేసిన జగన్.. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో జగన్ ముచ్చటించారు.

 

ఈ క్రమంలోనే పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవంటూ విద్యార్థులు జగన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జగన్.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement