
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ప్రకృతి కూడా ఈ ఏడాది రైతులను ఆశీర్వదించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం మంగళవారం ట్వీట్ చేశారు.