సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ జగన్‌ ప్రార్థనలు

YS Jagan Mohan Reddy at CSI Church In Pulivendula - Sakshi

సాక్షి, పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంద‌డంతో చ‌ర్చి పాస్ట‌ర్లు జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం  ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. కాగా అంతకు ముందు తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, దర్గా పీఠాధిపతి  ఘన స్వాగతం పలికారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
కడప సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ జగన్‌ ప్రార్థనలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top