భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నాం: వైఎస్‌ జగన్‌

YS Jagan Congratulates Indian Air Force Over Surgical strike 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు దాడులు జరిపిన భారత వైమానిక దళాన్ని(ఐఏఎఫ్‌) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్‌ పైలట్లకు అభినందనలు తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌-2ను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

చదవండి: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top