మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి | YS family members pay tributes to YSR at Idupulapaya | Sakshi
Sakshi News home page

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

Jul 8 2015 8:33 AM | Updated on Jul 7 2018 2:52 PM

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి - Sakshi

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు బుధవారం వైఎస్ఆర్ జిల్లా ఘనంగా జరుగుతున్నాయి.

కడప : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు బుధవారం వైఎస్ఆర్ జిల్లా ఘనంగా జరుగుతున్నాయి. మహానేత జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్కు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.  వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ జయంతి కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహానేత 66 వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement