వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం | Yanamala Ramakrishnudu takes on kcr | Sakshi
Sakshi News home page

వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

Aug 11 2014 5:31 PM | Updated on Aug 27 2018 8:44 PM

వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం - Sakshi

వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టాలు, రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందని యనమల సూచించారు.


'విభజన బిల్లు తయారీలో కేసీఆర్‌ పాత్ర కీలకం. అలాంటిది ఆయనే చట్టాన్ని వ్యతిరేకించడం సరికాదు. బిల్లును రూపొందించినపుడు టీడీపీ నాయకులను సంప్రదించలేదు. బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు కేసీఆర్‌ మాట్లాడారా? వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వివాదాల వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఎక్కడున్నా తెలుగువారే అని గుర్తించాలి' అని యనమల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement