'టీడీపీకి పట్టం కట్టిన జిల్లాల్లోనే బాబు పర్యటన' | y visweswara reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'టీడీపీకి పట్టం కట్టిన జిల్లాల్లోనే బాబు పర్యటన'

Apr 10 2015 1:52 PM | Updated on Jul 28 2018 3:23 PM

'టీడీపీకి పట్టం కట్టిన జిల్లాల్లోనే బాబు పర్యటన' - Sakshi

'టీడీపీకి పట్టం కట్టిన జిల్లాల్లోనే బాబు పర్యటన'

సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వై విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం : సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే,  వైఎస్ఆర్ సీపీ నాయకుడు వై విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలో కరువు ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. టీడీపీకి పట్టం కట్టిన జిల్లాలో మాత్రమే చంద్రబాబు పర్యటిస్తున్నారు అన్నారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష సంతకాలు సేకరిస్తానని చెప్పారు. హంద్రీ - నీవాకు వెంటనే రూ. 2 వేల కోట్లు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వై విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement