'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్ | Y.S.Jagan mohan reddy begins tour of cyclone affected areas in West Godavari | Sakshi
Sakshi News home page

'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్

Nov 27 2013 10:14 AM | Updated on Aug 17 2018 8:19 PM

ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు

ఇటీవల వరుస తుఫాన్లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న  పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు.  నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement