మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం | Wrath of the restrictions on the media Jagan | Sakshi
Sakshi News home page

మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం

Mar 25 2015 2:08 AM | Updated on Jul 25 2018 4:09 PM

మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం - Sakshi

మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ఆయన  వద్ద ఆంక్షల విషయం ప్రస్తావించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆంక్షలు విధించడం సరైన పద్థతి కాదని అన్నారు.

ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పారు. సభలో సభ్యుల గొంతు నొక్కినప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం వంటివి చేస్తారని, వాటిని ప్రసారం చేయకూడదని నియంత్రించడం సరికాదని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement