భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష | wife sentenced life in husband murder case | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష

Oct 22 2013 8:05 PM | Updated on Sep 1 2017 11:52 PM

భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు

ఆలంపల్లి: భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. గత సంవత్సరం (2012) అక్టోబర్‌లో బషిరాబాద్ మండల పరిధిలోని గొట్టిగకుర్ధులో మైలారం నాగమ్మ భర్త మైలారం చిన్నమల్కప్పను హత్య చేసింది. శవాన్ని దాచిపెట్టిన సంఘటనలో అప్పటి బషిరాబాద్ ఎస్‌ఐ రఘునాథ్ కేసు నమోదు చేశారు. కోర్టులో కేసుకు సంబంధించి అభియోగ పత్రాలు సమర్పించడంతో పీపీ శుక్లవరధన్‌రెడ్డి వాదించారు.

 

నేరం రుజువు కావడంతో పూర్వపరాలు పరిశీలన అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి ఉదయగౌరి  నాగమ్మకు శిక్ష ఖరారు చేశారు. . ఆమెకు యావజ్జీవ  శిక్షతో పాటు రూ. 15వేలు జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement