రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నాం | we requested president to keep state united, says mysura reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నాం

Nov 4 2013 9:49 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నాం - Sakshi

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నాం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలోని సీనియర్ నాయకులు కలిశారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాజ్భవన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలోని సీనియర్ నాయకులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా విన్నపం చేశారు. రాష్ట్ర విభజనకు ఆధారం ఉండాలని, గతంలో ఆచరించిన విధానాన్నైనా అనుసరించాలని కోరామని, తమ విన్నపాన్ని రాష్ట్రపతి సావధానంగా విన్నారని, వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారుని పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు.

రాష్ట్రపతికి రెండు వినతిపత్రాలు ఇచ్చామని, విభజన నిర్ణయం సరైంది కాదని రాష్ట్రపతికి విన్నవించామని, ఎలాంటి కమిటీల ప్రతిపాదనలు లేకుండానే విభజన చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మైసూరారెడ్డి, సోమయాజులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు.

ఇక.. రాష్ట్ర విభజన ఆగాలంటే రాష్ట్రపతే దిక్కు అని లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా ఉరేసే నిర్ణయం జరిగిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశానని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement