శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా.. | Two Died in Road Accident | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకుని వెళుతుండగా..

Sep 26 2015 8:30 AM | Updated on Oct 8 2018 5:45 PM

తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది.

తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం కిన్నెవోరంపాడు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement