తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది.
తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమైన ఓ భక్త బృందం శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం కిన్నెవోరంపాడు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.