ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర‍్మరణం

పుల‍్లంపేట (వైఎస్సార్‌ జిల్లా) : వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం, రెడ్డి పల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండురుకు చెందిన కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి, వస్తుండగా వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top