నేటి ముఖ్య వార్తలు.. | Today News updates | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్య వార్తలు..

Oct 10 2017 7:57 AM | Updated on Oct 10 2017 7:57 AM

సాక్షి, హైదరాబాద్‌:

♦ యువభేరి
నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో యువభేరి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరుకానున్నారు.

 టీపీసీసీ ధర్నా
ఇవాళ ఉదయం 10 గంటలకు ట్యాంక్‌ బండ్‌ వద్ద టీపీసీసీ ధర్నా నిర్వహించనుంది.

♦ ప్రెస్‌ అకాడమీ
నేడు విజయవాడలో ఏపీ ప్రెస్‌ అకాడమీ కార్యాలయం ప్రారంభంకానుంది.

♦ చౌరస్తా మూసివేత
నేటి నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా మూసివేయనున్నారు. స్కైవే, మెట్రో పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలుండనున్నాయి. యూటర్న్‌ ద్వారా ట్రాఫిక్‌ను మళ్లింపు చేయనున్నారు. 

♦ బీజేపీ కార్యవర్గ భేటి
నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది.

♦ చలో వంశధార
ఇవాళ  అఖిలపక్షం ఆధ్వర్యంలో చలో వంశధార కార్యక్రమం జరగనుంది. దీంతో వంశధార ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

♦ ఓపెన్‌ డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ డిగ్రీ/పీజీ దూర విద్య కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. చివరి తేది ఈ నెల 21 

♦ రెండో టీ20
నేడు భారత్‌-ఆస్ట్రేలియా రెండో టీ20 జరగనుంది. గువాహటి వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

♦ ఫిఫా వరల్డ్‌ కప్‌
అండర్‌-17 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌లో నేడు కోస్టారికా vs గయానా, స్పెయిన్‌ vs నైగర్‌, ఇరాన్‌ vs జర్మనీ, కొరియా vs బ్రెజిల్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement