పరుగులు పెట్టించిన చిరుతపులి | Tirupati residents fear of Panther | Sakshi
Sakshi News home page

పరుగులు పెట్టించిన చిరుతపులి

Jan 8 2015 5:01 PM | Updated on Sep 2 2017 7:24 PM

చిరుతపులి(ఫైల్)

చిరుతపులి(ఫైల్)

చిత్తూరు జిల్లా తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది.

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్(స్విమ్స్) సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఆస్పత్రి వెనుకభాగంలో ఆవు, కుక్కలపై దాడి చేసి చంపేసింది.

చిరుతపులిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అది మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుత బారి నుంచి తమను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement