రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | three injuries in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Jun 29 2016 12:07 AM | Updated on Aug 28 2018 7:14 PM

హరిపురం నుంచి సోంపేట వస్తున్న టాటా మేజిక్ వాహనం తాళభద్ర పంచాయతీ రాణిగాం జంక్షన్ పాత జాతీయ రహదారిపై

 సోంపేట : హరిపురం నుంచి సోంపేట వస్తున్న టాటా మేజిక్ వాహనం తాళభద్ర పంచాయతీ  రాణిగాం జంక్షన్ పాత జాతీయ రహదారిపై   మంగళవారం   బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుపతి రెడ్డిబాలాజితో పాటు ఇద్దరు ప్రయూణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
  బారువ పోలీసులు తెలిపిన వివరాలు... హరిపురం నుంచి  ప్రయాణికులతో సోంపేట వస్తున్న టాటా మేజిక్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను   విశాఖపట్టణం  ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రయూణిస్తున్న మందస మండలం చిన్నకేశపురం గ్రామానికి చెందిన వరాలమ్మ (54),సవరబాణాపురం గ్రామానికి చెందిన  శాంతమ్మ(43)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పలాస ఆసుపత్రికి తరలించారు.  బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement