20 ఏళ్లలో రాజధాని నిర్మిస్తాం: మంత్రి | The capital will be built in 20 years | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో రాజధాని నిర్మిస్తాం: మంత్రి

Mar 7 2015 3:10 AM | Updated on Sep 2 2017 10:24 PM

మరో 20 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.

నెల్లూరు: మరో 20 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  రాజధాని నిర్మాణానికి రూ. 1.15 లక్షల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 2018, జూన్ 7 నాటికి రాజధాని నిర్మాణంలో తొలి దశ పూర్తిచేస్తామని ప్రకటించారు. కాగా, రాజధానిని నిర్మించాలంటే వందేళ్లైనా పడుతుందని చెప్పారు.ఒకట్రెండు రోజులు పాటు తళుక్కుమని కనిపించి వెళ్లే వారికేం తెలుస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement