సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత | Telugu Literary Critic Chekuri Rama Rao passed away | Sakshi
Sakshi News home page

సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత

Jul 24 2014 8:23 PM | Updated on Aug 13 2018 7:54 PM

సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత - Sakshi

సుప్రసిద్ధ సాహితీవేత్త 'చేరా' కన్నుమూత

సుప్రసిద్ధ సాహితీవేత్త చేకూరి రామారావు(80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన 'చేరా' పేరుతో ప్రసిద్దులు.

హైదరాబాద్: సుప్రసిద్ధ సాహితీవేత్త చేకూరి రామారావు(80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన 'చేరా' పేరుతో ప్రసిద్దులు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో ఆయన జన్మించారు. అమెరికా కార్నెల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.

2002లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన 'స్మృతి కిరణాంకం'కు ఈ అవార్డు దక్కింది. ముత్యాలసరాల ముచ్చట్లు, ఇంగ్లీషు-తెలుగు పదకోశం, తెలుగులో వెలుగులు(భాషా పరిశోధన వ్యాసాలు), రెండు పదుల పైన, చేరా పీఠికలు, తెలుగు వాక్యం, కవిత్వానుభవం ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని. చేరాతలు పేరుతో ఏళ్ల తరబడి సాహితీ కాలమ్ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement