కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం | technical defect in volvo bus going to tirupati | Sakshi
Sakshi News home page

కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం

May 20 2014 9:32 AM | Updated on Sep 2 2017 7:37 AM

హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది.

హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది. కేశినేని ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు కర్నూలు - పాణ్యం మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినా ట్రావెల్స్ సిబ్బంది మాత్రం అస్సలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

హైదరాబాద్లో బయల్దేరిన తర్వాత కర్నూలు వరకు బాగానే వెళ్లినా, కర్నూలు - పాణ్యం మధ్యలో ఉన్నట్టుండి ఈ బస్సులో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, అక్కడినుంచి గమ్యానికి ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement