
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 798.20 అడుగులు
శ్రీశైల జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 798.20 అడుగులకు చేరుకుంది.
రివర్ స్లూయిస్ గేటు ద్వారా కొనసాగుతున్న నీటివిడుదల
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 798.20 అడుగులకు చేరుకుంది. మూడు రోజులుగా రివర్స్ స్లూయిస్ గేటు ద్వారా దిగువ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. గురువారం సాయంత్రం సమయానికి జలాశయం నుంచి 1.8868 టీఎంసీల నీరు దిగువకు విడుదలైంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో 75 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 28.1303 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.