ప్రధానితో రేపు సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ | Seemandhra Union ministers to meet Manmohan Singh tomorrow | Sakshi
Sakshi News home page

ప్రధానితో రేపు సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ

Nov 6 2013 8:26 PM | Updated on Sep 2 2017 12:20 AM

ప్రధానితో రేపు సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ

ప్రధానితో రేపు సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ

సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశం కానున్నారు.

సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశం కానున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్రకు ప్యాకేజీ విషయం గురించి చర్చించనున్నారు.

సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధానికి మంత్రులు నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో కూడా సీమాంధ్ర మంత్రులు కలవనున్నారు. ఇదిలావుండగా, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement