పథకం అదే పేరే మారుతోంది.. | Scheme becoming same name | Sakshi
Sakshi News home page

పథకం అదే పేరే మారుతోంది..

Jul 11 2014 2:01 AM | Updated on Sep 2 2018 4:48 PM

ఇంకు గుంటల పథకానికి పేరు మార్చి మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2004 ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వర్షం నీరు వృధా కాకుండా

 శ్రీకాకుళం: ఇంకు గుంటల పథకానికి పేరు మార్చి మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2004 ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వర్షం నీరు వృధా కాకుండా ఉండేందుకు ఇంకుడు గుంటల పథకాన్ని ప్రారంభించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పాఠశాల్లోనూ ఇటువంటి ఇంకుడు గుంటలను ప్రారంభించారు. అప్పట్లో కోట్లాది రూపాయలు వెచ్చించినా అవి బూడిదలో పోసిన పన్నీరే అయింది. అటువంటి గుంటలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలు అవసరమే అయినప్పటికీ చిత్తశుద్ధి కొరవడడంతో కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఇటువంటి పథకానికి మళ్లీ పేరు మార్చి ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్’ పేరిట మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement