ఏపీ ఎంసెట్-2015కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ (అపరాధ రుసుం లేకుండా) శనివారం సాయంత్రంతో ముగిసిందని కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
ముగిసిన ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
అపరాధ రుసుంతో మే 6 వరకు అవకాశం
కాకినాడ: ఏపీ ఎంసెట్-2015కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ (అపరాధ రుసుం లేకుండా) శనివారం సాయంత్రంతో ముగిసిందని కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాలకు కలిపి 2,50,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 16 వరకూ, రూ.1,000 రుసుంతో 22 వరకూ, రూ.5,000 రుసుంతో మే 2 వరకూ, రూ.10 వేల రుసుంతో మే 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మే 2 నుంచి 6 వరకు హాల్ టిక్కెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎపీఎంసెట్.ఓఆర్జీ’ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నంబర్, తండ్రి పేరు వంటివి మార్పు చేయాలంటే వాటి ఒరిజనల్స్ తప్పక తీసుకురావాలని సూచించారు. ఈ మార్పులకు ఏప్రిల్ 16 నుంచి 21 వరకూ అవకాశం ఉందన్నారు. సందేహల నివృత్తికి విద్యార్థులు నేరుగా గాని, 0884-2340535,2356255 నంబర్లలోగాని సంప్రదించవచ్చని తెలిపారు.