సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ

Published Mon, Nov 17 2014 12:17 PM

robbery in Saptagiri grameena bank  at chittoor district

తిరుపతి : చిత్తూరు జిల్లా వరదాయపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు గత రాత్రి గ్యాస్ కట్టర్లతో కిటికీలు తొలగించి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు నిర్థారించారు. అయితే ఎంత నగదు చోరీకి గురైందనే విషయంపై మాత్రం బ్యాంక్ సిబ్బంది పెదవి విప్పటం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement