పలు చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
కొవ్వూరు: పలు చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరు నేరపరిశోధక విభాగం పోలీస్స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పది మంది దొంగలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారి నుంచి 15 కాసుల బంగారం, రూ.1.42 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు కొవ్వూరు, తణుకు, అత్తిలి, నిడదవోలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 15 చోరీలకు పాల్పడినట్టు డీఎస్పీ తెలిపారు.