లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు | road accident at prakasam distirict | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Jul 24 2015 9:05 AM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పవర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో..

మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పవర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఓ ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రయాణికుడికి సమీపంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించగా, తీవ్ర గాయాలైన బస్సు డ్రైవర్ ఎంఆర్ బాబును 108లో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పుష్కరాల రద్దీ నేపథ్యంలో బస్సు విజయవాడకు వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం వారిని వేరొక బస్సులో విజయవాడకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement