
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా సి రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఎంపికయ్యారు. మంగళవారం సాయంత్రం ఇందిరాభవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంఎల్సీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్ సింగ్, వాయిలార్ రవి హాజరయ్యారు. ఫ్లోర్ లీడర్ రేసులో ఎంఎల్సీలు చెంగల్ రాయుడు తదితరులు పోటీపడ్డా.. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత రామచంద్రయ్య వైపే మొగ్గు చూపారు. కాగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవని విషయం తెలిసిందే.