శ్రీకాకుళం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన కారణంగా జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. శుక్రవారం నుంచే కోతల వాతలు పెరగనున్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లాకు విద్యుత్ కోటాను తగ్గించడమే ఇందుకు కారణం. రోజుకు జిల్లాకు 34 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా గతంలో 32 లక్షల యూనిట్లు సరఫరా అయ్యేది. డిమాండ్, సరఫరాల మధ్య తేడా 2 లక్షల యూనిట్లు మేర ఉండడంతో జిల్లా ట్రాన్స్కో అధికారులు కోతలు విధిస్తూ వస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట కూడా కోతలు విధించేవారు.
తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకు విద్యుత్ కోటాను 28 లక్షల యూనిట్లకు తగ్గించారు. దీంతో డిమాండ్, సరఫరాల మధ్య ఏకంగా 6 లక్షల యూనిట్ల మేర తేడా ఏర్పడింది. ఈ కారణంగా విద్యుత్ కోతలు ఇబ్బడిముబ్బడి కానున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు కూడా కోత విధించనున్నారు. 10 జిల్లాల తెలంగాణకు విద్యుత్ను ఎక్కువగా కేటాయించిన అధికారులు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు తగ్గించటంతో ఆ మేరకు జిల్లాలకు కోటా తగ్గించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన వల్ల జిల్లాలకు విద్యుత్ కోటా పెరగవచ్చునని అధికారులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
జిల్లాలో 70 శాతం మందికిపైగా జనం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగా ఉండగా, ఇప్పుడు కోటా తగ్గడం వల్ల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూన్ 2 తర్వాత పరిస్థితి మారవచ్చునని విద్యుత్ శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితిలో సానుకూల మార్పేమీ ఉండదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన పెరగటం లేదా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు.
విద్యుత్ కోతలు మరింత తీవ్రం
Published Fri, May 23 2014 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement