సభలో స్పీకర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : సభలో స్పీకర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ కోరిన చీఫ్ విప్.. కాలువ శ్రీనివాసులు ఆ మేరకు ప్రతిపాదించారు. ఈ అంశాన్ని స్వీకరించామని.. తరువాత చూద్దామని.. బడ్జెట్పై చర్చను మొదలు పెట్టాలని స్పీకర్ కోరారు. దీంతో గొల్లపల్లి సూర్యారావు మరోసారి తన ప్రసంగం మొదలు పెట్టినా.. ముందుకు సాగలేదు.